సినీ నటి గీతాంజలి కన్నుమూత…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, అక్టోబర్ 31: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆమె గురువారం వేకువ జామున తుది శ్వాస విడిచారు.1957లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన గీతాంజలి..సహనటుడు రామకృష్ణను వివాహం చేసుకున్నారు.
సీతారామ కల్యాణం సినిమా ద్వారా సినిమాల్లో అడుగుపెట్టారు. కలవారి కోడలు, డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, దేవత, గూఢచారి 113, శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. గీతాంజలి మృతి విషయం తెలిసి టాలీవుడ్ నిర్ఘాంతపోయింది. చాలామంది ప్రముఖులు ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు ఆమె మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ, ఆమె మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.