బొగ్గు గనిలో ప్రమాదం..నలుగురు మృతి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
భువనేశ్వర్, జూలై 24 : బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన ఒడిశా రాష్ట్రంలోని కోల్ ఇండియా బొగ్గు గనిలో బుధవారం చోటుచేసుకుంది. ఒడిశాలోని మహానంది గనిలో పైకప్పు కూలడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గని కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి పంపించి, చికిత్స అందిస్తున్నారు. బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంతో గనిలో బొగ్గు వెలికితీతను నిలిపివేశామని కోల్ ఇండియా ప్రతినిధి మెహ్రా చెప్పారు. గనిలో వారం రోజుల అనంతరం బొగ్గు వెలికితీస్తామని మెహ్రా పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబరులో మేఘాలయలోనూ బొగ్గు గనుల్లో జరిగిన ప్రమాదంలో 15 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.