అందరికివ్వకపోతే దీక్ష చేస్తా….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హుజూరాబాద్, ఆగస్టు 14: దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రూ.10 లక్షలు దళితులు వారి నైపుణ్యానికి అనుగుణంగా ఖర్చు పెట్టుకొనే వెసులుబాటు కల్పించాలని అన్నారు. వాటి మీద కలెక్టర్, బ్యాంక్ మేనేజర్ ల అజమాయిషీ తీసివేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు అందరికీ అందించకపోతే ఉద్యమం తప్పదని, అందరికీ అందించకుండా చాటలో తవుడు పోసి కొట్లాట పెట్టినట్టు చేస్తే మాత్రం నేనే దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వెంటనే అందించాలని ఈటల డిమాండ్ చేశారు.