ఆ మాజీ ఎమ్మెల్యే ఇకలేరు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
మంచిర్యాల, ఏప్రిల్ 9: టీఆర్ఎస్ సీనియర్ నేత, కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య (68) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన కొద్ది సేపటి క్రితం స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సమ్మయ్య సుదీర్ఘకాలంగా టీఆర్ఎస్కు సేవలందిస్తున్నారు. సిర్పూరు టి.నియోజకవర్గం నుంచి 2009, 2011లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2014లో బీఎస్పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2018 ముందస్తు ఎన్నికల ముందు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయిన తన భార్య సాయిలీలతో కలిసి టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాగా, సమ్మయ్య మరణ వార్త తెలిసిన సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన సేవలను గుర్తు చేసుకుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.