బంగారు తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయం
1 min read
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పేదలకు వైద్యం అందాలని, బంగారు తెలంగాణ కావాలని సీఎం కేసీఆర్ కలలు కన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ లో మీడియా తో మంత్రి మాట్లాడుతూ మహిళలకు పౌష్టక ఆహారం , కేసీఆర్ కిట్స్ లాంటి పథకాలు అందించారని,మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న ఆసుపత్రులు మెరుగు పర్చామని తెలిపారు. అడవుల్లో ఉన్న ఆదివాసులకు, మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్యం అందించాలనేది ప్రభుత్వం ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఉద్యోగులకు, జర్నలిస్ట్ లకు హెల్త్ కార్డ్స్ విషయంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ వీటిపై సమీక్ష నిర్వహించారని, ఆసుపత్రుల్లో హెల్త్ కార్డ్స్ తోపాటు ఆరోగ్య శ్రీ పని చేస్తాయని , దంత వైద్యశాలల్లో కూడా త్వరలో నియామకాలు చేపడుతామని. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ కిట్ ను ప్రయివేట్ కు అప్పగించమని. ప్రతి పేద విద్యార్థి వైద్య విద్యను అభ్యసించే విదంగా అనేక జిల్లాల్లో వైద్య కళాశాల లు ఏర్పాటు చేస్తామని మంత్రి రాజేందర్ స్పష్టం చేశారు .