రేపు అక్కడ మన జాతీయ పండుగ
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, ఆగస్టు 14: ఏడు దశాబ్దాలకు పైగా మన జాతీయ జెండా పండుగకు నోచుకోని అక్కడ గురువారం మన జాతీయ జెండా రెపరెపలాడబోతుంది.ఈ మేరకు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాలను జమ్మూ-కశ్మీరులో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సాహసోపేతమైన చర్యలతో జమ్మూ-కశ్మీరును భారతదేశంలో పరిపూర్ణంగా అంతర్భాగం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పెద్దఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జమ్మూ-కశ్మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ (ప్లానింగ్ కమిషన్) రోహిత్ కన్సల్ జమ్మూ-కశ్మీరు, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవాలను నిర్వహించేందుకు డ్రెస్ రిహార్సల్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈద్ పండుగ ప్రశాంతంగా ముగియడంతో నిషేధాజ్ఞలను మరింతగా సడలించినట్లు తెలిపారు. జమ్మూ ప్రాంతంలో దాదాపు ఆంక్షలు లేవని, కశ్మీరులో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆంక్షలు ఉన్నట్లు తెలిపారు. కాగా,
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 15న శ్రీనగర్లోని లాల్ చౌక్లో జాతీయ జెండాను ఎగురవేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ నెల 16, 17 తేదీల్లో లడఖ్లో పర్యటిస్తారని కూడా సమాచారం.