సమ్మెపై విచారణ రేపటికీ వాయిదా
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, అక్టోబర్ 28: ఆర్టీసీ సమ్మెపై విచారణ రేపటికీ వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎల్లుండివరకు గడువు కావాలని కోరగా, హైకోర్టు నిరాకరిస్తూ, రేపు మధ్యహ్నం 2.30 గంటలకు మరోసారి విచారణ చేపడతామని పేర్కొంది. అంతకుముందు కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ.175 కోట్ల నష్టం వచ్చిందని, రాజకీయ పార్టీలు కార్మికులను తప్పదోవ పట్టిస్తున్నాయంటూ.. చర్చల వివరాలను తెలుపుతూ అదనపు అడ్వకేట్ జనరల్ అదనపు కౌంటర్ దాఖలు చేశారు. ఈడీల కమిటీ 21 అంశాలను పరిశీలించి ఆర్టీసీ ఎండీకి నివేదక సమర్పించిందని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. ఈ డిమాండ్లలో 18 డిమాండ్లను నెరవేర్చడానికి సరిపడా నిధులు సంస్థ వద్దలేదని ఈడీ నివేదికలో పేర్కొందని రామచంద్రరావు తెలిపారు. ఈడీ కమిటీ నివేదిక తమకెందుకు సమర్పించలేదని కోర్టు ప్రశ్నించింది. నివేదికలు కోర్టుకు కూడా తెలపరా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు ఓవర్ నైట్లో ఆర్టీసీ విలీనం ఎలాజరుగుతంటూ ప్రశ్నించింది. కార్మికుల డిమాండ్లు సాధ్యం కాదని ముందే నిర్ణయం తీసుకున్నారా అని వ్యాఖ్యానించింది. సమ్మె చట్ట విరుద్ధమని ఏఏజీ తన వాదనలో పేర్కొనగా, చట్ట విరుద్ధమని చెపుతున్నారు ? వారిపై చర్యలు ఏమైనా తీసుకున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం సమస్య పరిష్కారానికి ఆర్టీసీకి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వగలదా అని కోర్టు ప్రశ్నించగా, ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి రూ.450కోట్లు ఇచ్చిందని అదనపు అడ్వకోట్ జనరల్ తెలిపారు. మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి ప్రభుత్వ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శిని పిలుస్తామని కోర్టు వ్యాఖ్యానించింది. అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఆర్టీసీ తరపున వాదనలు వినిపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ బి ఎస్ ప్రసాద్ ను హాజరుకాలని కోర్టు పిలిపించింది. అనంతరం బిన్ ప్రసాద్ ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగించారు. కార్మికుల తీరు సరిగా లేదని ప్రసాద్ కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం విచారణను హైకోర్టు రేేపటికీ వాయిదా వేసింది. మరీ రేేపు ఏమి జరుగనుందో వేేేేచి చూడాల్సిందే.