సలహాదారుగా టంకశాల అశోక్ బాధ్యతలు స్వీకరణ
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 27 : రాష్ట్ర సచివాలయం డీ బ్లాక్లోని కార్యాలయంలో గురువారం ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ జర్నలిస్టు, రచయిత, సాహితీవేత్త టంకశాల అశోక్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. టంకశాల అశోక్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున టంకశాల అశోక్ అంతర్రాష్ట్ర సంబంధాల వ్యవహారాలు చూస్తారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, బీసీ కమిషన్ సభ్యులు కృష్ణమోహన్, అశోక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర సంబంధాలు చాలా ముఖ్యమైనవని, వాటిని అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తానన్నారు.