సహనం కోల్పోయిన ఇల్లాలు..ఆ తరువాత ఎం చేసింది
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 25 : కట్టుకున్న భార్య, కన్న బిడ్డను నిర్లక్ష్యం చేస్తూ, మరో మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య ఉతికి ఆరేసింది. ఇద్దరినీ చెప్పులతో వాయించింది. ఈ ఘటన హైదరాబాద్ కూకట్ పల్లి లోని ప్రగతినగర్ లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కొత్తకమ్ముగూడెం గ్రామానికి చెందిన లక్ష్మణ్కు, సౌజన్యతో 2010లో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు. ఈ క్రమంలో కొద్ది కాలం క్రితం లక్ష్మణ్కు కరీంనగర్ జిల్లా వెంకట్రావు పేటకు చెందిన అనూష అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కాగా, అనూషకు కూడా 2013లో కోలా రవికాంత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు.ప్రస్తుతం అనూష, భర్త రవికాంత్ను వదిలిపెట్టి..లక్ష్మణ్తో కలిసి కూకట్పల్లిలోని ప్రగతి నగర్లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో లక్ష్మణ్, అనూషల సంబంధం గురించి సౌజన్యకు తెలిసి నిలదీసింది. లక్ష్మణ్, అనూష కలిసి దిగిన ఫోటోలను పెద్దమనుషుల ముందు పెట్టి నిలదీయగా.. అవి గతంలో దిగిన ఫోటోలని.. ప్రసుత్తం తమ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని లక్ష్మణ్ బుకాయించాడు. కొద్ది రోజుల పాటు బుద్ధిగానే ఉన్న లక్ష్మణ్.. తిరిగి అనూషతో తన సంబంధాన్ని కొనసాగించడం ప్రాంరభించాడు. ఈ క్రమంలో సౌజన్య గురువారం లక్ష్మణ్, అనూషలను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని చెప్పుతీసుకుని చితకబాదింది. సహనం నశించిన ఆ ఇల్లాలు భర్తను తనేం తప్పుచేశానంటూ నిలదీసింది. తనకు, తన కొడుకుకు అన్యాయం చేస్తున్నావ్ అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం వీరి పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. మరి పోలీసులు ఈ భార్య భర్తల పంచాయతీని ఎలా తేలుస్తారో వేచిచూడాలి.